కావలసిన పదార్దాలు:
బియ్యం ఒక కప్
పెరుగు రెండు కప్పులు
మినపప్పు ఒక టీ స్పూన్
ఆవాలు 1/2 టీ స్పూన్
జీలకర్ర 1/2 స్పూన్
మెంతులు 1/2 స్పూన్
ఎండు మిరపకాయలు రెండు
పచ్చి మిర్చి రెండు
కొత్తిమీర ఒక కట్ట
చిన్న అల్లం ముక్క
శొంటి చిన్న ముక్క
పసుపు, ఉప్పు తగినంత
తయారుచేయు విధానం:
అన్నం వండుకుని కొంచెం చల్లరేక పెరుగు,పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.అల్లం ,శొంటి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా
చేసి ,పెరుగన్నంలో కలిపేసుకోవాలి.
స్టవ్ మీద భాణాలి పెట్టి రెండు స్పూన్లు నూని వేసి పైన చెప్పిన మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు,ఎండు మిరపకాయలు వేయించుకుని సిద్ధం గా ఉన్న పెరుగు అన్నం లో కలపాలి. పైన కొత్తిమీర చల్లు కోవాలి. అంతే దద్దోజనం సిద్ధం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి