కేసరి పూర్ణాలు
కావలసినవి
బొంబాయి రవ్వ 1/2 కేజీ
పంచదార 750 గ్రా
నెయ్యి చిన్న కప్
ఏలకులపొడి 1 స్పూన్
జీడిపప్పు కావలసినంత
కొబ్బరి తురుము 1/2 కప్
మినపప్పు 2 గ్లాస్
బియ్యం 4 గ్లాస్
నూనె వేయించడానికి సరిపడా తయారుచేయువిధానం రవ్వను వేయించి .,జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి .,బాణలిలో నీరు మరగించి పంచదార వేసి కరిగేకా రవ్వ వేస్తూ కలిపి నెయ్యి వేసి ,.కొబ్బరి తురుము వేసి బాగా కలిపి చివరగాఏలకుల పొడి ,.జీడిపప్పు వేసి చల్లరేక చిన్న,.చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి
మినపప్పు.,బియ్యం 4 గంటలు నానపెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని కేసరి ఉండలు ఈపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకుంటే పూర్ణాలు రెడీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి