బొంబాయి రవ్వ ఒక కప్పు
మైదా ఒక కప్పు
పానీ కి కావలసినవి :-
పుదీనా ఆకు -1 కప్పు
చింతపండు రసం-1/4 కప్పు
పచ్చిమిర్చి-4
మిరియాలు-4
ఆవాలు, జీలకర్ర-1/2 టీ స్పూన్
నిమ్మకాయ రసం-4 స్పూన్స్
సరిపడా ఉప్పు
పంచదార-1 స్పూన్
బఠానీలు-1/2 కప్పు
తయారు చేయు విదానం :-
గంట ముందుగ బొంబాయి రవ్వ, మైదా పిండి పూరి పిండిలా కలిపి పెట్టుకోవాలి.
పుదీనా ఆకూ, చింత పండు రసం, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, నిమ్మ రసం, ఉప్పు, పంచదార, అన్ని కలిపి మిక్సిలో వేసి
మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. గ్రైండ్ చేసిన తరువాత వడపోసి, దాని లో రెండు గ్లాసుల నీళ్ళు పోసి కలిపి తయారు చేసి పక్కన
పెట్టుకోవాలి.పాని తయారైనట్టే.
పిండిని చిన్న చిన్న పూరిల్లా వత్తుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని సరిపడా నూనె వేసి గరిట తో నొక్కుతూ వేయించు
కోవాలి. నూనెలో వేసి గరిటతో నొక్కుతూ చేస్తే పొంగుతాయి.ఇప్పుడు పూరి కూడా తయార్.బఠానీలని కొద్దిగా నీరు
పోసి,తగినంత ఉప్పు వేసి ఉడికించుకుని తినేటప్పుడు పూరిలో వేసుకుని,తరువాత పానీ వేసుకుని తింటే చాల బాగుంటుంది.
dont try this plz.............
రిప్లయితొలగించండిHaritha garu,
రిప్లయితొలగించండిLet us know what is wrong with this recipe.