18, జనవరి 2011, మంగళవారం

అల్లం పచ్చడి

కావలసిన పదార్ధాలు :
అల్లం -1/4 కేజీ
చింతపండు- 1/2 కేజీ
బెల్లం-1/4 కేజీ
మెంతులు-50 గ్రాములు
జీలకర్ర-1 టీ స్పూన్
ఆవాలు-1 టీ స్పూన్
ఉప్పు తగినంత
పసుపు -చిటికెడు
కారం-1/4 కిలో

తయారుచేసే విధానం :
వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం బాగా కడుగుకొని తొక్క తీసివేయాలి.తడి ఆరేవరకు ఎండలో ఆరబెట్టుకోవాలి.
బాణాలిలో మెంతులు నూనెలేకుండా వేయించుకొని పొడి చేసిపెట్టుకోవాలి.ఆరిన అల్లాన్ని రెండు చెంచాల నూనె వేసి వేయించుకోవాలి.వేయించిన అల్లం,నానబెట్టిన చింతపండు,బెల్లం,ఉప్పు,మెంతిపొడి,పసుపు,కారం  మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి.బానాలిలో నాలుగు చెంచాల నూనె వేసి ,ఆవాలు,జీలకర్ర వేసి వేయిన్చుకున్నాక,మిక్సిలో వేసిన పచ్చడిని 5 నిమిషాలు వేగిన పోపులో వేసి కాసేపు గరిటెతో అటుఇటు తిప్పి పెట్టుకోవాలి.
వెల్లులి ఇస్ష్టపడే వారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి