కావలసిన పదార్ధాలు:
మైదా-1 కేజీ
నెయ్యి లేదా డాల్డా - 100 గ్రాములు
వంట సోడా-1/4 టీ స్పూన్
పంచదార- 1/౩ కేజీ
పెరుగు -1/3 కప్
నీళ్ళు- చిన్న కప్పు
యాలకులు- 4
తయారుచేయు విధానం:
మైదాలోకరిగించిన నెయ్యి లేదా డాల్డా మరియు పెరుగు వేసి పూరి పిండిలా కలిపి 2 గంటలు నానపెట్టాలి.తరువాత చిన్న వుండాలా చేసి మధ్యలో వేలితో నొక్కాలి.స్టవ్ మీద బాణాలిలో నూనె పోసి కాగాక సన్న మంట మీద వేయించుకోవాలి.వేగిన బాదుషాలని పక్కన పెట్టుకోవాలి.
పంచదార పాకం తయారి: గిన్నెలో నీరు పోసి ,దానిలో పంచదార కరిగించుకొని తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ,తయారైన బాదుషాలని పాకంలో ముంచి తియ్యాలి.బాదుషా తయారైనట్టే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి