9, జనవరి 2011, ఆదివారం

బొబ్బట్టు



శెనగపప్పు :- 1 గ్లాసు.
పంచదార:-మూడు వంతులు(గ్లాసు)
మైదా:-1/4కిలో
ఏలకులు:-4
మైదాపిండిని చపాతి పిండి కన్నా కొంచెం పలచగా కల్పి నూనె పోసి ఉంచాలి. 1 గంట నానాలి. శెనగపప్పు నీరు పోసి మెత్తగా ఉడకపెట్టాలి. ఉడికేకా చిల్లుల గిన్నెలోనికి వార్చుకోవాలి. నీరు వారేకా శెనగపప్పు,పంచదార కల్పి మెత్తగా రుబ్బుకోవాలి.ఏలకులు మెత్తగా పొడి చేసి ముద్ద లో కలుపుకోవాలి.ముద్ద ని చిన్న ఉండలు గా చేసి,మైదా పిండి ముద్ద ని కొంచెం తీసుకొని చేతికి నూనె రాసుకొని మైదాపిండి ముద్ద ని చేతితో పూరిలాగా చేసుకుని దానిలో శెనగపిండి ముద్దని పెట్టి దానిని మూసి వేసి దానిని ప్లాస్టిక్ కవర్ మీద కాని అరటి ఆకు మీద కాని నూనె రాసి పలచగా వత్తాలి.పెనం స్టవ్ మీద పెట్టి కాగాక బొబ్బట్టు దాని మీద వేసి వేగనివ్వాలి.అంతే బొబ్బట్టు తయారు.

1 కామెంట్‌: