7, జనవరి 2011, శుక్రవారం

కజ్జికాయలు

 కావలసిన పదార్దాలు :
  మైదా -1 కప్
  పుట్నాల పప్పు-1 కప్
  పంచదార -1 కప్
  ఎండు కొబ్బరి -1/2కప్
  జీడి పప్పు తగినంత
  ఏలకులు -4
  నూనే వేయించడానికి సరిపడా
తయారు చేయు విదానం :
పుట్నాలపప్పు ,కొబ్బరి, పంచదార  మిక్సి లోవేసుకుని పిండి చేసుకోవాలి.  ఏలకులు పొడి చేసుకుని కలుపుకోవాలి.  జీడిపప్పుపిండిలో  కలుపు కోవాలి. మైదా  పూరిపిండిలా కలుపుకుని  పూరిచేసుకోవాలి.   పూరి మధ్యలో రెండు స్పూన్ల పొడినివేసి,చేతితో మూయవచ్చు లేదా  కజ్జికాయల చెక్కతో చేసుకోవచ్చు .బాణాలిలో నూనె కాగాక బంగారు రంగులో వచ్చేదాకా
వేయించుకొని తీసేయ్యాలి.

4 కామెంట్‌లు: