20, జనవరి 2011, గురువారం

గోరు చిక్కుడు పాఠోలి



కావలసినవి :
గోరుచిక్కుడు చిన్నచిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.
4 స్పూన్స్ సెనగపిండి.
4 స్పూన్స్ నూనె
1 స్పూన్ ఆవాలు
1 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ మినపఫ్ఫు
2 ఎండుమిర్చి
1 స్పూన్ కారం
సరిపడ ఉప్పు
కరివేపాకు
తయారు చేసే విథానం:
ముందుగా గోరు చిక్కుడు ముక్కలు ఉడికించి పెట్టుకోవాలి. బానలిలో నూనె వేసి పోపు వేయించుకోవాలి.
వేగిన నూనెలొ కరివేపాకు వేయాలి.
సెనగపిండిని నీల్లల్లో కలిపి పేస్ట్ లా చేసుకుని దానిలో సరిపడ ఉప్పు , కారం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వేయించిన పోపు లొ వేసి పొడిపొడిగా అయ్యేవరకు వేయించుకోవాలి.
బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గొరు చిక్కుడు ముక్కల్ని వేసి కొంచుం ఉప్పు వేసి కలుపుకున్సి 3 నిముషలు వేయించుకోవాలి.
గోరు చిక్కుడు పాఠోలి రెడి.
ఈ పాఠోలిని ఇంక ఇలాగ కూడా చేసుకోవచ్చు.శనగ పప్పు కాని,పెసరపప్పుతో గాని చేసుకోవచ్చు.వాటితో చేసేటప్పుడు ,ముందుగా ఆ పప్పుని నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి.మిగిలినదంతా పైన చెప్పిన విధంగా చేసుకోవచ్చు.


2 కామెంట్‌లు: