19, జనవరి 2011, బుధవారం

సేమ్య పులిహోర

కావలసినవి:
1 కప్పు సేమ్య
3 లేక 4 చెంచాలు చింతపండు రసం
1 స్పూన్ శనగపప్పు
1 స్పూన్ మినపప్పు
1 స్పూన్ ఆవాలు
పచ్చిమిర్చి
మిరపకాయలు
జీడిపప్పు
కరివేపాకు
సరిపడ ఉప్పు
చిటికెడు పసుపు
తయారు చేసే విధానం:
ముందుగా సేమ్యాని వేడి నీటిలో ఉడకపెట్టాలి.
ఉడికిన సేమ్యాని పసుపు వేసిన చల్లని నీటిలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా చేస్తే సేమ్యా పొడి పొడిగ ఉంటుంది.
తర్వాత బాణాలిలో 4 స్పూన్స్ నూనె వేసి పోపు వేయించుకోవాలి.
పోపు వేగిన తర్వాత చింతపండు రసం , ఉప్పు వేసి 2 నిముషాలు ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న సేమ్య లొ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి కలుపుకుంటె సేమ్యా పులొహోర రేడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి